తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 333 వ రోజు శనివారం నిర్వహించారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినదించారు.
ఈ నిరసన కార్యక్రమంలో మంగళగిరి రురల్ మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తిరువీధుల బాపనయ్య సంఘీభావం తెలియజేసారు. ఈ నిరసనలో షేక్ సాబ్ జాన్, మన్నవ వెంకటేశ్వరరావు, పఠాన్ జానీ ఖాన్, మన్నవ సుబ్బారావు, ముప్పేర మాణిక్యాలరావు, ముప్పేర సుబ్బారావు, మాదల లక్ష్మీనారాయణ, మన్నవ కృష్ణారావు, పలగాని కృష్ణ, ముప్పేర ప్రవీణ్
తదితర రైతులు పాల్గొన్నారు