శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట పరిసర ప్రాంతాలలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితి నెలకొంది. దీంతో వ్యవసాయాన్నే నమ్ముకున్న అక్కడి రైతులు ఇబ్బంది పడుతున్నారు.
పంటలు ఎండిపోయి నేల బీటలు బారి పోవటంతో ఆవేదన చెందుతున్నారు. ఈ పరిసర ప్రాంత భూములకు నారాయణపురం ఆనకట్ట నుంచి వచ్చే గడ్డ నీరు ఆధారంగా ఉంటుంది.
అయితే ఈ ఏడాది ఆ గడ్డ కూడా ఆధునిక పనులు పేరుతో మరమ్మత్తులు చేపట్టడంతో నీరు రాకుండా పోయింది. దీంతో నేడు బిజెపి నాయకులు పేడాడ సురపు నాయుడు, జనసేన నాయకులు రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
తక్షణమే ఈ కాలువ గుండా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎండిన పొలాలకు తక్షణమే పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పేడాడ రామ్మోహన్ బెండి రవికాంత్, నర్సింగరావు, ప్రసాదరావు,ధనుంజయ రావు, నరసింగరావు కోదండరావు, ఢిల్లీశ్వర రావు రైతులు పాల్గొన్నారు.