35.2 C
Hyderabad
April 20, 2024 18: 07 PM
Slider ముఖ్యంశాలు

అగ్ని ప్రమాదంలో తండ్రీ కొడుకులు సజీవదహనం

#fire

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కృష్ణబజార్‌ సెంటర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబికా జ్యూవెల్లర్స్‌లో భవనంలో షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కాగా, అంబికా జ్యూవెల్లర్స్‌లో పైఅంతస్తులో షాపు ఓనర్స్‌ మల్లేశ్వరరావు ఫ్యామిలీ నివాసం ఉంటోంది. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా భవనంలో మంటలు చెలరేగడంతో మల్లేశ్వరారావు, ఆయన కుమారుడు మౌలేష్‌ అక్కడే సజీవ దహనమయ్యారు. మిగిలిన ఇద్దరు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పాత భవనం కావడంతో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినట్టు సమాచారం.

Related posts

బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కార్యాలయం ప్రారంభం

Bhavani

ధరణి అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS

ఎనాలసిస్: ఆర్ధిక ఉద్దీపనకు నిర్మలమైన ప్యాకేజీ

Satyam NEWS

Leave a Comment