శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో సూపరెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ మడే రమేష్, అతని భార్య ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి ప్రసన్న లు ఇద్దరు పిల్లలుతో కలిసి విశాఖ నుండి పలాస వస్తుండుగా కార్ ప్రమాదం జరిగింది. జిల్లాలోని నందిగామ మండలం పెద్దినాయుడు పేట గ్రామ 16వ నెంబర్ జాతీయ రహదారి పై అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందగా తల్లి కూతురుల పరిస్థితి విషమం గా ఉంది. వెనుక నుంచి వస్తున్న లారీ కారును డీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
కారులో ముందు సీట్లులో ఉన్న తండ్రి కొడుకులు ఘటనా స్థలంలో మృతి చెందారు. తల్లి కుమార్తెల పరిస్థితి విషమం గా ఉంది. అత్యవసర వైద్యo కోసం తల్లి కుమార్తె ను విశాఖ తరలించారు.