కుటుంబ పరువును బజారు పాలు చేస్తుందని బాధతో సొంత కోడలిని చాకు తో పొడిచి చంపాడో మామ. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం మేడిచర్ల పాలెం గ్రామం చొప్పల విజయ్ అనే యువకుడు అండమాన్ ప్రాంతానికి చెందిన ప్రియమణి ని వివాహం చేసుకున్నాడు వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. కుటుంబ ఉపాధి నిమిత్తం విజయ్ గల్ఫ్ దేశంలో ఉంటున్నాడు.
ప్రియమణి అత్తవారింట్లో ఉంటుంది. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో ప్రియమణి చనువుగా ఉంటుందని తెలుసుకున్న విజయ్ తండ్రి సత్యనారాయణ అలియాస్ సత్తియ్య ఆమెకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు.
ప్రియమణి కుటుంబసభ్యుల మాట లెక్కచేయకుండా ఉండడంతో ఈ సమస్యపై మలికిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సమస్య పెద్దల సమక్షంలో సరి చేద్దాం అనుకునే లోపు శుక్రవారం మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియదు సత్యనారాయణ తన కోడలిని చాకు తో పొడిచి చంపి నేరుగా పోలీసులకు లొంగిపోయాడు.
పరువు కోసం క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక ప్రాణం తీసింది. దీనిపై మలికిపురం ఎస్ ఐ ఎం నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.