అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని తండ్రి రవి చేతిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
కవల పిల్లలు అయిన ఐదేళ్ల సుదీప్, సుధీర్ లను రవి చింపేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక తన ఇద్దరు కొడుకులను తీసుకెళ్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గొంతు నులిమి చంపి అతను పూడ్చి పెట్టాడు.
సమాచారం తెలుసుకున్న స్థానికులు ఫారెస్ట్ లోకి వెళ్లి పూడ్చి పెట్టిన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు.
కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని తండ్రి రవిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.