దారుణం జరిగిపోయింది. ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ లో ఇద్దరు మరణించారు. ఈ విషయాన్ని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్ సైట్ లో ఉంచిన పరిశోధనా పత్రంలో పేర్కొన్నది.
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అతి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ తో మరణించారని ఆ పత్రంలో పేర్కొన్నారు.
ఫైజర్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఒక 55 సంవత్సరాల వ్యక్తి హృదయ సంబంధిత రుగ్మతతో మరణించారు. మరో వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు మూడు రోజుల తర్వాత కండరాల వాపు వ్యాధితో మరణించారు.
ఎఫ్ డి ఏ వెలువరించిన ఈ పరిశోధనాత్మక వ్యాసంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలుగుతున్నది. కరోనా వ్యాక్సిన్ భద్రతపై పెను దుమారం రేగుతున్నది.
ఈ పరిణామాల దృష్ట్యా కరోనా వ్యాక్సిన్ ను నిర్బంధం చేయడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రేపు (డిసెంబర్ 10), ఆ తర్వాత డిసెంబర్ 17న ఎఫ్ డి ఏ మరో రెండు పబ్లిక్ డాక్యుమెంట్లు విడుదల చేయబోతున్నట్లు కూడా తెలిసింది.
(ఎఫ్ డి ఏ ఇచ్చిన ఈ సమాచారాన్ని విడుదల చేసింది కేవలం సమాచారం కోసం మాత్రమే తప్ప ప్రజలకు ఆందోళన కలిగించేందుకు కాదు)