ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి దేశానికి గర్వకారణమైన పీవీ సింధు ను అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఢిల్లీలో ఘనంగా సన్మానించారు.
కేంద్ర అ క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో బిజెపి మీ ఎంపీలు అరవింద్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో కలిసి ఎంపీ సోయం బాపు రావు శాలువతో సన్మానించి అభినందించారు.
దేశ ప్రతిష్టను పెంచిన పివి సింధు తాత, తండ్రి కి అదిలాబాద్ జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.
క్రీడాకారులకు పీవీ సింధు ఆదర్శంగా నిలుస్తారని కేంద్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.