తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొంతగాని సత్యనారాయణ, ఆధ్వర్యంలో ఇటీవల ఆచార్య బిరుదు సాధించిన తెలంగాణ రాష్ట్ర సమాచార సమైక్య అధ్యక్షుడు తడకమళ్ళ రామచంద్రరావు ఆసియా కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ పొందిన పి.పట్టాభి దాసు ని ఘనంగా సన్మానించి సత్కరించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు ఆదివారం పి.పట్టాభి దాసు కు అభినందన సభ నిర్వహించారు. పలువురు కళాకారులు ఘనంగా పట్టాభి దాసును సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ డాక్టర్ బిరుదు సాధించిన పట్టాభి దాసును సన్మానించుకోవడం తమకు ఆనందంగా ఉందని,పట్టాభి మరెన్నో బిరుదులు పొందాలని త్రికరణశుద్ధిగా కోరుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమైక్య ఉపాధ్యక్షుడు డాక్టర్ గుంటి పిచ్చయ్య,కార్యవర్గ సభ్యుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, ప్రముఖ రంగస్థల కళాకారుడు కొట్టు లక్ష్మీనారాయణ బాబు,ముస్తఫా,గుండు వెంకటేశ్వర్లు,ధరావత్ శివ రామ్ నాయక్,కంబాల నాగమణి, నియోజకవర్గ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్