30.7 C
Hyderabad
April 19, 2024 08: 04 AM
Slider విశాఖపట్నం

పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణ కు ఘనసత్కారం

#padmasrisunkaraadinarayana

సమాజంలో ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన రీతిలో వారు ఇతరులకు సహాయం అందించాలని అటువంటి తరుణంలోనే వారు కోరుకున్న సమున్నత గౌరవం లభిస్తుందని పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణ అన్నారు. ఆదివారం ఇక్కడ  నరసింహ నగర్ రైతు బజార్ సమీప  కల్యాణ మండపంలో విశాఖ జిల్లా కాపునాడు సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంటూరు నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన సభ లో ఆయన పాల్గొని మాట్లాడారు.

అందరూ ఐక్యమత్యంగా ఉండాలనీ, సమిష్టి కృషితోనే విజయాలు సాధ్యపడతాయన్నారు. తనను సత్కరించిన కాపునాడు సంఘానికి   ఆయన పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. సన్మాన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చోడవరం శాసన సభ్యులు, అనకాపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ సుంకర ఆదినారాయణ కు పద్మశ్రీ పురస్కారం  లభించడం యావత్ కాపు జాతికి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు..

తన వైద్య వృత్తి తో ఎంతో మందికి ఆదినారాయణ బాసటగా నిలిచారని అటువంటి వ్యక్తికి పద్మశ్రీ ఇవ్వడం ఎంతైనా సముచిత స్థానం అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని దర్మశ్రీ  ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఏనాడు ఆయన సన్మానాలు పురస్కారాలు  కోరుకోలేదు అన్నారు.

జివిఎంసి డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ఏయూ రిజిస్ట్రార్ కృష్ణ మోహన్, అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబులు మాట్లాడుతూ. సుంకర ఆది నారాయణ దంపతులు ను  సత్కరించుకోవడం గర్వ కారణం గా ఉందన్నారు.

పోలియో బారిన పడిన ఎంతో మందికి ఆయన ఆపన్నహస్తం అందించి ప్రాణదాతగా నిలిచారన్నారు. ఆదినారాయణ మహోన్నతమైన వ్యక్తిగా వీరంతా కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా కాపునాడు అధ్యక్షుడు గుంటూరు వెంకట నరసింహారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమ సంఘము ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

అనేక రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదిగిన ప్రముఖులు అందర్నీ కూడా తమ సంఘం ద్వారా ఇప్పటికే సత్కరించడం జరిగిందన్నారు. తాజాగా కాపునాడు ఆధ్వర్యంలో అనేక విభాగాలు ఏర్పాటు చేసి పేద ,మధ్య తరగతి వారందరికి కూడా సహాయం అందించి ఉన్నత స్థాయికి చేర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జనపరెడ్డి పృథ్వీరాజ్, తోట నగేష్ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకు సాగాలని అటువంటి అప్పుడే ఇటువంటి పురస్కారాలు లభిస్తాయన్నారు.. ఆదినారాయణ జీవితం ఏంతో మంది కి ఆదర్శ ప్రాయమన్నరు.

తదుపరి అతిథుల చేతుల మీదుగా డాక్టర్స్ సుంకర ఆదినారాయణ, శశిప్రభ దంపతుల ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వంగా  వెంకట  ప్రభాకర్, నారా  నాగేశ్వరరావు, డి పోలారావు, సుబ్రహ్మణ్యం,అడబాల  నారాయణరావు, అడబాల  పాండురంగారావు, సుంకర రవీంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎడిటర్ ను బెదిరిస్తున్న వారిపై చర్య తీసుకోవాలి

Satyam NEWS

మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అత్తిలి అప్పారావు మృతి

Satyam NEWS

Leave a Comment