గురుకుల కళాశాలలో చదువుతూ దేశంలోని అత్యున్నత పీజీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులను ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా సన్మానించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ గురుకుల కళాశాలలో చదివిన విద్యార్ధులు విశేష ప్రతిభ కనబరిచారు.
గిరిజనులైన ఈ విద్యార్ధులు సాధించిన విజయం అందరికి స్ఫూర్తినిస్తుందని వారిని సన్మానించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంద్ర అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి శ్రీనివాస స్వామి పాల్గొన్నారు.