27.7 C
Hyderabad
April 18, 2024 09: 28 AM
Slider రంగారెడ్డి

ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ పై మహిళా ఎంపీపీ ఫైర్

మండల ఎంపీపీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారని జైపాల్ యాదవ్ పై ఎంపీపీ నిర్మల విరుచుకుపడ్డారు.
పదేపదే ప్రోటోకాల్ ను పాటించాలని సమస్యాత్మకం చేయకూడదని చెప్తారని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మంగళవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు ఎంపీపీ నిర్మల ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తను వస్తున్నానని వస్తానని తెలిసి కూడా మండల ఎంపీపీ లేకుండా కార్యక్రమాలను ఎలా మొదలు పెడతారని, నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానని ప్రోటాకాలను పాటించారా అంటూ కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను ప్రశ్నించారు.

మహిళ ఏం పి పి అనే గౌరవం లేకుండా చులకనగా చూస్తున్నారని అధికారులు కనీసం చరవాణి ద్వారా సంప్రదించాలనుకున్న చరవాణి ఎత్తటం లేదని అసహనం వ్యక్తం చేశారు.కనీసం కార్యక్రమాలలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అధికారులు ఉన్నారా చూసుకోకుండానే కార్యక్రమాలు నిర్వహించడం పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఒక మహిళ ఎంపీపీని సమాచారం ఇవ్వకుండా అవమానపరిచారని ఇదేనా మీరు చేసే పద్ధతి అని నాకెందుకు చెప్పలేదు అంటూ అధికారులు నిలదీశారు.

Related posts

వైయస్ వివేకా 72వ జయంతి నిర్వహించిన కుటుంబ సభ్యులు

Satyam NEWS

దేశ రైతుల మేలు కోసమే నూతన చట్టాలు

Satyam NEWS

ఏపీలో పొంగులేటి రెడ్డికి 1600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్

Bhavani

Leave a Comment