బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామంలో నిర్మిస్తున్న ఎరువు షెడ్డు పనులను ఎంపీడీఓ ఆనంద్ ఎంపిపి అశోక్ పటేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మూడు ఆదర్శ గ్రామాలుగా ఎంపికైన వాటిలో రాజుల గ్రామం ఉందని గ్రామంలో ఎరువుల షెడ్డుతో పాటు వైకుంఠ ధామం పనులను గత రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రారంభించారు.
వీటి నిర్మాణాలను తరగతిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అదేశి౦డ౦తో పనులు వేగవంతం గా నిర్మాణం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరువురితో పాటు సర్పంచ్ చంద్ర బాగా ఉపసర్పంచ్ హనుమంతరావు, మండల పరిషత్ అధికారి మహబూబ్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.