కరోనా కాటుకు కుల,మత, ప్రాంతం , దేశం, పేద, ధనిక అనే బేధం లేదని రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి అన్నారు. కరోన వైరస్ వ్యాపించ కుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని ఆయన అన్నారు.
దేశ ఐక్యతను చాటి చెప్పేందుకు ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు తిరుపతి లో తన నివాసం లో కుటుంబ సభ్యులు లతో కలసి ఆయన దీపాలను వెలిగించారు. ఒక మతానికో , కొందరు వ్యక్తులుకో దీన్ని అపాదించ కూడదని, భారతీయులుగా పోరాటం చేద్దామని ప్రతి మతాన్ని, కులాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించుకోవడమే మానవత్వమన్నారు. లౌకిక దేశమైన మన దేశంలో ప్రతి ఒక్కరి సాంప్రదాయాలను, మనోభావాలను గౌరవిద్దామన్నారు. కమ్మేసిన కరోనా చీకట్లు అతి త్వరగా తొలగిపోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆయన సతీమణి మేడా సుచరిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.