నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, పోలీసులకు భయపడేది లేదని రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎర్రజెండా పోరాటం ఆగదని, మరింత ఉద్ధృతం చేస్తామని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షులు శీతల రోషపతి హెచ్చరించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కేంద్రంలో సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి పై అక్రమ కేసులకు నిరసనగా పరిశ్రమల వాడలో నిరసన ప్రదర్శనలో రోషపతి పాల్గొని మాట్లాడుతూ ఢిల్లీలో అల్లర్లకు సంబంధించిన కేసులో ఏచూరి తో పాటు మరికొందరి మీద కేసులు సరికాదని తక్షణమే విరమింప చేయాలని కోరారు.
హైదరాబాదులో సిపిఐ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం సరైంది కాదని, దాడి చేసిన ముష్కరులపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బిజెపి కుతంత్రాలలో ప్రధాన భాగంగా జరుగుతుందని ఆరోపించారు.
ఇదంతా చూస్తుంటే 1977 లో కాంగ్రెస్ ఎమర్జెన్సీని తలపిస్తూ నేడు బిజెపి ఎమర్జెన్స్ పెట్టి ప్రభుత్వంపై శత్రుశేషం లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు.
శ్రమజీవులు పేద ప్రజల సమస్యలు ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాటం చేస్తుందని,ఇలాంటి జిమ్మిక్కులకు భయపడేది లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో చింతకాయల పర్వతాలు, ఎలక సోమయ్య గౌడ్, సాముల కోటమ్మ, వెంకన్న, నాగమ్మ, గోవిందమ్మ, మంగమ్మ, ముత్తమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.