28.7 C
Hyderabad
April 25, 2024 05: 32 AM
Slider విజయనగరం

రాజ్ న్యూస్ రిపోర్ట‌ర్ కుటుంబానికి చెక్ పంపిణీ….!

#rajnews

పోలీస్ బాస్ చేతులు మీదుగా…ల‌క్ష 43 వేల  చెక్ అంద‌జేత‌..!

మీడియా  రంగం కొత్త పుంత‌లు కొత్త ఒర‌వ‌డి తొక్కుతున్న  వేళ‌..రేటింగ్స్..టీఆర్పీ కోసం…మాన‌వ‌తా విలువ‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్న ఈ స్మార్ట్  యుగంలో..కూడా  కొన్ని కొన్ని ఛానల్స్…ఆన్ లైన్ న్యూస్ నెట్ లు మాన‌త‌వ్వాన్ని చూపిస్తున్నాయి…ఆయా ఆన్ లైన్ స‌ర్వీసులు ప్ర‌సారం చేస్తున్న క‌థ‌నాల‌ను…చూప‌రుల‌ను క‌న్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆ కోవ‌లోకే వ‌చ్చింది..సత్యం న్యూస్.నెట్. నెట్ వ‌ర్క్ ఏదైనా  కావండి…ఆన్ లైన్ న్యూస్ మ‌రేదైనా అవ్వ‌నివ్వండి…మీడియా ఛాన‌ల్ ఇంకేదైనా కానివ్విండి..స్పందించే గుణం అంద‌రిలో ఒక్క‌టే. దాన్ని గుర్తించింది….స‌త్యం న్యూస్.నెట్.ఇక ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రోక్షంగా న‌డిపేది…న‌డిపించేంది…మీడియానే.

ఇదే విష‌యం రాజ్యాంగంలోకూడా పొందుపర‌చ‌డింది. ఫోర్త్ ఎస్టేట్ అంటే..మీడియా  రంగ‌మేన‌ని.అటువంటి మీడియారంగంలో కూడా..సాధ‌క బాధ‌లు కూడా ఉంటాయి…దాన్ని  న‌డిస్తున్న వ్య‌క్తుల స‌మూహం క‌ల‌య‌కే…ఫోర్త్ ఎస్టేట్. అలాంటి పోర్ట్ ఎస్టేట్ లో…ఎత్తు ప‌ల్లాలు..కుటుంబ బాధ్య‌త‌లు లాంటివి కూడా ఉంటాయ‌ని తెలుసుకోవ‌డం వేరు. అలా  తెలుసుకున్నా…న‌ష్ట‌పోయి….ఇబ్బందులు ప‌డుతున్న కుటుంబాల‌కు చేయూత నిందించడం వేరు.

కొన్ని కొన్ని సంద‌ర్బాల‌లో ఆయా మీడియా సంస్థ‌లే త‌లో చెయ్యి వేసి…సంబందిత  కుటుంబాన్ని ఆదుకుంటూ ఉంటాయి.అలాంటి కుటుంబ‌మే…ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బొబ్బిలికి చెందిన‌ రాజ్ న్యూస్ రిపోర్ట‌ర్ పెంకి శంక‌ర‌రావు కుటుంబం. ఇటీవ‌లే  శంక‌ర‌రావు అక‌స్మాత్తుగా భార్య‌,పిల్ల‌ల‌కు దూర‌మయ్యారు. దీంతో తోటి జ‌ర్న‌లిస్ట్ మృతి చెంద‌డంతో..సంబంధిత మీడియా  సంస్థ 13 జిల్లాల నుంచీ విరాళాలు సేక‌రించింది.

మొత్తం..ల‌క్ష 43 వేల సొమ్మును చెక్ రూపంలో… జిల్లా ఎస్పీ దీపికా త‌న ఛాంబ‌ర్ లో మీడియా జ‌ర్న‌లిస్టులుతో క‌లిసి ఆ రిపోర్ట‌ర్ కుటుంబానికి  అంద చేసారు.ఈ సంద‌ర్బంగా సంబందిత‌ రిపోర్ట‌ర్ భార్య  మాట్లాడుతూ…తోటి జ‌ర్న‌లిస్టులు అంద‌రూ త‌లో చెయ్యివేసి  న‌న్ను,నా బిడ్డ‌ను ఆదుకోవ‌డం చాలా ఆనందంగా ఉందని..అదీ.ఎస్పీ చేతులుమీదుగా చెక్ ను అంద చేయ‌డం….ఇంకెంతో ఆనందంగా ఉంద‌న్నారు….మృతి చెందిన రాజ్ న్యూస్ రిపోర్ట‌ర్ భార్య‌.జ్యోతి

Related posts

తైక్వాండో మాస్టర్ కు చిన్నారి చిరు సహకారం

Satyam NEWS

అక్రమంగా లింగనిర్ధారణ చేసి గర్భస్రావాలకు పాల్పడే ముఠా అరెస్టు

Bhavani

ఫొటో ఫినిష్: టీడీపీ నేతలపై దాడి చేసింది జగన్ మనిషే

Satyam NEWS

Leave a Comment