39.2 C
Hyderabad
March 28, 2024 15: 32 PM
Slider ముఖ్యంశాలు

సుక్మా ఎన్ కౌంటర్ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం

#Y S Jagan

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు.

ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు.

ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.

విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.

Related posts

నల్గొండలో నర్సింగ్ అధికారుల కొవ్వొత్తి ర్యాలీ

Satyam NEWS

గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశం

Satyam NEWS

నిజాయితీగా వ్యాపారం చేయకపోతే చర్యలు

Bhavani

Leave a Comment