39.2 C
Hyderabad
March 28, 2024 14: 23 PM
Slider హైదరాబాద్

బిల్లు కోసం వేధించిన కొటెక్ మహేంద్ర బ్యాంకుకు జరిమానా

#kotak mahendra

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదని ఖాతాదారుడిని వేధించినందుకు కొటెక్ మహేంద్ర బ్యాంకుకు 90 వేల రూపాయల జరిమానా విధించారు. హైదరాబాద్ లోని బాలానగర్ ప్రాంతంలోని దిల్ కుష్ నగర్ కు చెందిన ఐటి ఎంప్లాయ్ మహ్మద్ ముదసీర్ 2019 లో కొటెక్ మహేంద్ర మాదాపూర్ బ్యాంకులో లక్షా 12 వేలు క్రెడిట్ కార్డు లోన్ తీసుకున్నాడు.

అయితే 2020లో కరోనా కారణంగా ఆయన పని చేస్తున్న ఐటి కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగం పోవడంతో సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులను మహమ్మద్ ముదసీర్ కట్టలేకోయాడు. లోన్ డబ్బుల కోసం ముదసీర్ ను వేధింపులకు గురి చేయడంతో పాటు దుర్బాష లాడారు

కొటెక్ మహేంద్ర క్రెడిట్ కార్డు రికవరీ ఎజెంట్స్. దాంతో ముదసీర్ తెలంగాణ వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించాడు. తెలంగాణ వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం ఏప్రిల్ 7, 2021లో ముదసీర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

45 రోజుల్లో బాధితుడి కి నష్టపరిహారంగా 90 వేలు డబ్బులు చెల్లించాలని కొటెక్ మహేంద్ర బ్యాంకుకు వినియోగదారుల ఫోరమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే బాధితుడికి నేటికి కొటెక్ మహేంద్ర బ్యాంకు నష్టపరిహారం చెల్లించలేదు.

Related posts

భద్రాచలంలో నేటి నుండి అందరికి నిత్యం అన్నదానం

Satyam NEWS

పవన్ కల్యాణ్ సీఎం కావాలని మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కిన మహిళ…

Bhavani

పబ్ కల్చర్:హైదరాబాద్ పబ్బుల్లో మందు బాబుల ఆకృత్యాలు

Satyam NEWS

Leave a Comment