కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఏర్పాటు చేసుకున్న సినీ నటులు అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కు ట్రాఫిక్ పోలీసులు జరి మానా విధించారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ మీదుగా రేంజ్ రోవర్ కారులో వెళ్తున్న అల్లు అర్జున్ ను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నీరూస్ చౌరస్తాలో ఆపారు. కారు అద్దాలకున్న నలుపు రంగు తెరలను తొలగించి, మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లం ఘన కింద రూ.700 జరిమానా విధిం చారు.
ఇదే చౌరస్తా నుంచి వస్తున్న నటుడు కల్యాణ్ రామ్ రేంజ్ రోవర్ కారును సైతం ఆపి, అద్దాలకున్న నలుపు రంగు తెరల్ని తొలగించి రూ.700 జరిమానా విధించారు.