కరోనా నేపథ్యం లో ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్రీదేవసేన అన్నారు. సోమవారం రోజున పట్టణం లోని శివాజీచౌక్ లోని కూరగాయల మార్కెట్, వ్యాపార ప్రాంతమైన అంబెడ్కర్ చౌక్ లో పర్యటించారు. పలు దుకాణాలలో మాస్క్ లేకుండా కొనుగోలు చేస్తున్నవారిని, వాహనాలపై వెళ్తున్నవారిని మాస్క్ లు ధరించాలని కలెక్టర్ షాపు నిర్వాహకులకు సూచించారు.
మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించాలని మున్సిపాల్ ఆఫీసర్లను ఆదేశించారు. కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలను అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ చూపిస్తూ కలెక్టర్కు వివరించారు.