25.2 C
Hyderabad
March 22, 2023 22: 25 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్ 1 నుంచి ఏపిలో నాణ్యమైన బియ్యం

y s jagan america

వచ్చే ఏడాది ఏఫ్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సింగా అధికారులకు సీఎం వైఎస్‌ జగన్ ఆదేశాలు జారీ చేశారు. నేడు పౌరసరఫరాల శాఖ పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న నాణ్యమైన బియ్యం పంపిణీ పై ఆరాతీశారు. ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని సేకరించేలా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకోవాలని సీఎం ఆదేశించారు.  రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు ఆదేశించారు. డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related posts

క్వారంటైన్ కేంద్రాలు రేపటి నుండి ములుగు జిల్లాలో పునఃప్రారంభం

Satyam NEWS

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Bhavani

మినీ గురుకుల పాఠశాలను పున:ప్రారంభించాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!