32.2 C
Hyderabad
March 28, 2024 23: 23 PM
Slider తూర్పుగోదావరి

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామికి అపచారం

#Antarvedi

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది.

శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది.

అయితే రథానికి మంటలు అంటుకోవడం ప్రమాదవశాత్తు జరిగిందా, ఆకతాయిల పనా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీ.

ఇలా జరగడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన సీతక్క

Satyam NEWS

ఏపీలో అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా

Satyam NEWS

బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు

Satyam NEWS

Leave a Comment