హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కాల్పుల కలకలం సంచలనం సృష్టించింది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వద్ద ఆగంతకులు కాల్పులు జరిపారు.
ఏటీఎం మిషన్ లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్ తో పాటు ఏటీఎం సిబ్బందిపై అగంతకులు కాల్పులు జరిపారు.
ఇద్దరు పై కాల్పులు జరిపి డబ్బులను దోచుకెళ్లారు. డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జరిపారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.
కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.