వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటీవ్ రావడంతో ఆ గ్రామస్థులు బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తించే ఆ వ్యక్తి ఇటీవల స్వగ్రామం సూగూరుకు వచ్చాడు.
మూడు రోజుల క్రితం తల్లిదండ్రులను చూడ్డానికి వచ్చిన అతను గ్రామంలో ఉండగానే అతని రిపోర్టు వచ్చింది. అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అతను తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అయితే అతను గ్రామంలో ఎక్కడెక్కడ తిరిగినది ఎవరితో కలిసింది పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
పెబ్బేరు డాక్టర్ల బృందం సూగూరు గ్రామంలో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆ యువకుడి తల్లిదండ్రులను క్వారంటైన్ కు తరలించే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా అతను కలిసివారిని కైడా ఐ సొలేషన్ కు తరలించే అవకాశం ఉంది.