హైదరాబాద్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ కి రంగం సిద్ధం అయింది. తెలంగాణ రాష్ట్రంలో మృగశిర కార్తె ప్రవేశం నేపథ్యంలో జూన్ 8, 9 తేదీల్లో ఆస్తమా రోగులకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్తమా రోగులు చేప ప్రసాదం పంపిణీ కి 5 నుంచి 6 లక్షల మంది వస్తారని, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఒడిశా ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఆస్తమా బాధితులు చేప ప్రసాదం తీసుకునేందుకు వస్తారు అని తెలిపారు.
previous post