సంవత్సరంన్నర క్రితం నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి దారి తప్పి పాకిస్తాన్ దేశం తీర రక్షణ దళాలకు పట్టుబడ్డారు. అప్పటి నుంచి అక్కడ జైల్లో మగ్గుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, భారతదేశ ప్రధాని మోడీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి తో మాట్లాడి వారిని తిరిగి తీసుకువచ్చారు. దీంతో మత్స్యకారులు కుటుంబాలలో ఆనందం వెల్లివిరిసింది.
శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తీవ్రస్థాయిలో కృషి చేసి, మత్స్యకారులను విడిపించడం లో ప్రధాన పాత్ర వహించారు. ఈ మత్స్యకారులు నేటి సాయంత్రం శ్రీకాకుళం చేరబోతున్నట్లు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ వారధి ఎర్రయ్య, మూగి శ్రీరాములు, అంబటి రాంబాబు, మూగి గురుమూర్తి, కర్రీ తాతారావు తెలిపారు.