మత్స్యకారుల సంక్షేమం కోసం పని చేసిన అమరులకు నివాళి అర్పించేందుకు 24న (శనివారం) సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకార సామాజిక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నారు.
గంట పాపారావు, లండ దానేసు, దాసరి సత్యనారాయణ, గుంటు జగదీశ్వరరావు మత్స్యకారుల సంక్షేమం కోసం పని చేసిన మహానుభావులని నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం పట్టణం లోని సెవెన్ రోడ్ జంక్షన్ దరి, ఎస్పీ బంగ్లా రోడ్ లో ఉన్న జిల్లా గ్రంధాలయం హాల్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మత్స్యకారుల హక్కులకోసం, సంక్షేమం కోసం పోరాటం చేసిన నాయకులను స్మరించుకుంటూ భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలని నిర్ణయించారు. ఈ సంస్మరణ సభకు మత్స్యకార నాయకులు, మేధావులు, కళాకారులు, పెద్దలు, మహిళలు, యువకులు హాజరు కావాలని కోరారు.