34.2 C
Hyderabad
April 23, 2024 12: 35 PM
Slider నెల్లూరు

నెల్లూరులో ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ ప్రారంభం

#fitIndia

నెల్లూరు లో ” ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ ” కార్యక్రమాన్ని నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర జిల్లా స్థాయి యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 75 వారాల పాటు “అజాది కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ” ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ ” నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం అవ్వాలని ఆయన కోరారు. 2047 లో దేశం ఎలా ఉండాలి అని యువత తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చునని, మన స్వాతంత్ర సమరయోధుల సందేశాలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రపంచంలో భారత్ ఒక గొప్ప దేశంగా ఎదగాలి. అందుకు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా మరియు విద్యాపరంగా అభివృద్ధి చెందాలి. ప్రపంచంలో అత్యధిక యువ శక్తి కలిగిన దేశం మనది. నవ భారత నిర్మాణంలో ఈ యువత పాత్ర కీలకమైనది. ప్రపంచం పటంలో భారత్ ఒక విశ్వగురువుగా నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవతరించబోతోంది అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

Related posts

కుషాయిగూడ యాదవ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Bhavani

వరద సాయంలోనూ తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష

Sub Editor 2

శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

Satyam NEWS

Leave a Comment