గాల్వాన్ లోయలో భారత సైనికులతో చైనా వాళ్లు తలపడ్డ ముష్టి యుద్ధం గుర్తున్నదా? అందులో భారత్ కు చెందిన 20 మంది వీరజవాన్లు అమరులయ్యారు.
దేశం మొత్తాన్ని అప్పటిలో ఆందోళనలో ముంచెత్తిన ఈ సంఘటనలో చైనా తరపున ఒక్కరు కూడా మరణించలేదని వార్తలు వెలువడ్డాయి.
అంతే కాదు. తమ వైపు ఎవరూ చనిపోలేదని చైనా బుకాయించింది. అయితే అది అబద్ధం. చైనా తరపున ముష్టి యుద్ధానికి దిగిన వారిలో ఐదుగురిని భారత వీర సైనికులు హతమార్చారు.
ఈ విషయాన్ని చాలా ఆలశ్యంగా చైనా నేడు అంగీకరించింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు.
2020 జూన్ 15న కారాకోరం లోయలో ఈ ముష్టి యుద్ధం జరిగింది.