28.7 C
Hyderabad
April 20, 2024 08: 10 AM
Slider విశాఖపట్నం

విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు: ఐదుగురు మావోల మృతి?

#encounter

విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్‌ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

ప్రాధమిక సమాచారం ప్రకారం ఐదుగురు మావోల మృతి చెందినట్లు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న గ్రేహాండ్స్‌ దళాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు తెలిసింది.

గంటపాటు ఎదురు కాల్పులు జరగ్గా చాలా మంది మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం. దీంతో మంప పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.

సరిహద్దులో వాహన తనిఖీలనూ ముమ్మరం చేశారు. మరణించిన వారిలో తెలంగాణ వాసి సందె గంగయ్య ఉన్నట్లు గుర్తించారు.

సందె గంగయ్య డీసీఎం కమాండర్ గా ఉన్నాడు. గంగయ్య దగ్గర ఏకే 47  లభ్యమైంది.

Related posts

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తహశీల్దార్ జయశ్రీ

Satyam NEWS

గోండులకు నిత్యావసర వస్తువులు పంచిన పోలీసులు

Satyam NEWS

మెడికల్ లీవ్: జ్వరంతో ఆస్పత్రిలో చేరిన సీఎం కేసీఆర్‌

Satyam NEWS

Leave a Comment