39.2 C
Hyderabad
April 18, 2024 17: 05 PM
Slider నల్గొండ

సీఎం కేసీఆర్ ను దూషించిన కేసులో ఐదుగురి పై కేసు నమోదు

#policecase

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మంత్రి జగదీష్ రెడ్డి ని మండల ఎంపీపీ నెమ్మది బిక్షంలను దూషిస్తూ సెల్ ఫోన్ లో  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఐదుగురు వ్యక్తుల పై పోలీసులు కేసు నమోదు చేశారు.

వారిని కోర్టులో హాజరు పరిచినట్లు సి ఐ విఠల్ రెడ్డి  ఎస్ ఐ శ్రీకాంత్  తెలిపారు.

నల్లగొండ జిల్లా  పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యూ బంజారాహిల్స్ కు చెందిన దరవత్ శ్రీను సీఎం కేసీఆర్ ను మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి ఎంపీపీ నెమ్మది బిక్షం లను అసభ్య పదజాలంతో దూషిస్తూ సెల్ఫీ వీడియో ను తన ఫోన్  లో రికార్డు చేశారు.

ఆ వీడియో లను A-2 గా ఉన్న దరవత్ శ్రీను కు పంపగా అతను ఆ వీడియో ను అన్ని గ్రూప్ లో పోస్ట్ చేశాడు. అలా చెట్ల ముకుంధపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి మరిపల్లి సీతారమయ్య  కు పంపగా అతను వివిధ గ్రూప్ లో పోస్ట్ చేశాడు.

ఇతన్ని ఏ3గా చేర్చారు. ఆ తర్వాత  ఉపేందర్  కూడా అదే పోస్ట్ ఉదేశ్యం పూర్వకంగా అందరికి పంపారు. ఫిర్యాదు రావడంతో వీరందరిని అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచినట్లు సిఐ విఠల్ రెడ్డి ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

Related posts

నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా రిక్షా కార్మికుల రేట్లు పెంచాలి

Satyam NEWS

చైనాలో ప్రమాదకరంగా పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

Satyam NEWS

Leave a Comment