23.2 C
Hyderabad
September 27, 2023 19: 51 PM
ఆంధ్రప్రదేశ్

గణనీయమైన ప్రగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్

pjimage (17)

నూతన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నదని, అందుకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గర్వించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఎపిపిసిబి) చైర్మన్ బి ఎస్ ఎస్ ప్రసాద్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన విజయవాడలోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం వద్ద జెండా వందనం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బందికి ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా మండలి సిబ్బంది అందరూ కృతనిశ్చయంతో పని చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది అందరూ నీతినిజాయితీలతో పారదర్శకంగా పని చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అప్పుడే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని ఆయన తెలిపారు.

Related posts

సన్ గాడ్:అరసవెల్లిలోరథసప్తమి వేడుకలుభక్తుల సందడి

Satyam NEWS

సాధారణ భక్తులూ దూరంగా ఉండండి

Satyam NEWS

కర్నాటక ఆదాయాన్ని మించిన ఆంధ్రా మందు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!