30.7 C
Hyderabad
April 19, 2024 07: 12 AM
Slider

మల్దకల్ బ్రహ్మోత్సవాలలో రేపు ధ్వజారోహణం

#MaldakalBrahmotsavam

గద్వాల జిల్లా నడిగడ్డ భక్తుల ఇలవేల్పు మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు కార్యనిర్వాణాధికారి సత్య చంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ధ్వజారోహణ కార్యక్రమం ద్వారా బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించే రీతిలో వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆగమ పద్ధతిలో ధ్వజరోహణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంతేగాక ద్వజారోహణం రోజున సంతానం లేని వారు స్వామివారి ప్రసాదం తీసుకుంటే సంతానము కలుగుతారని ప్రగాఢ నమ్మకం ఉంది. ఇదివరకు అనేకమంది సంతానం లేనివారు స్వామివారి ప్రసాదం తీసుకుని అనేకమంది సంతానవంతులయ్యారు. మరొక మహోత్సవం స్వామి వారి దేవాలయంలో పశ్చిమ ముఖాన ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్ వ్రతం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

ఆంజనేయ స్వామికి తోర పూజ, అభిషేకాలు, ఆకు పూజ నిర్వహిస్తున్నట్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఉత్సవాలను తిలకించాలని వారు కోరారు.

Related posts

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆనం

Satyam NEWS

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు

Satyam NEWS

వనపర్తిలో కుల గణన, క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment