విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగర పరిధిలోని కనపాక, గాజులరేగ, లంకాపట్నం ప్రాంతాల్లో విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, వన్ టౌన్ సీఐ జె.మురళి ,టూటౌన్ సీఐ సిహెచ్. శ్రీనివాసరావు ల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ అనిల్ మాట్లాడుతూ – మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించాలనీ ప్రజలను కోరారు. ఎవరైనా అల్లర్లు చేసేందుకు, తగాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అన్ని పార్టీల వారు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను అతిక్రమిస్తే పార్టీలకు అతీతంగా కేసులు నమోదు చేస్తామన్నారు.
మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని భద్రతా చర్యలు చేపడుతుందని, ప్రజలంతా పోలీస్ సహకరించాలని కోరారు. వన్ టౌన్ ,టూటౌన్ ఆర్మెడ్ రిజర్వు, రూరల్, ఎస్ టి ఎఫ్ పోలీసులు అధికారులు, సిబ్బంది ఈ ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు.