రోహిణీ కార్తలంటే రోళ్లు పగులుతాయంటారు.
అంటే ఈ మే నెలలో ఎండలు అంత తీవ్రంగా ఉంటాయని అర్ధం. ఆ సమయంలో పచ్చడి నూరుకునే రోలు కూడా పగిలిపోతుందని అంటారు.
సరిగ్గా ఇలాంటి సమయంలో మధ్యాహ్నం వరకూ తీవ్రంగా ఎండ కాసి మాడు పగిలే విధంగా భానుడు తన ప్రతాపం చూపించాడు.
అయే ఒక్కసారి విజయనగరం జిల్లాలో వాతావరణం మారిపోయింది. భానుడిని మబ్బులు కమ్మేసాయి. దీంతో ఎండ వేడి, ఉబ్బరం, వేడి గాల్పులు తీవ్రత మటు మాయం అయ్యింది.
నీలి రంగు ఆకాశం కాస్త.. మబ్బులతో కమ్మేసింది. దీంతో పెను గాలులకు దానికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
దాదాపు 40 నిమిషాలు వర్షం జిల్లా ను వణికించింది.