అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన ఉధృతం చేశారు. మందడం మెయిన్ సెంటర్ వద్ద రోడ్ కు అడ్డుగా ఫ్లెక్సీలను కట్టారు. ప్రధాని మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్, బుద్ధుడు విగ్రహాల తో ఉన్న ఈ ఫ్లెక్సీలతో తమ నిరసన తెలుపుతున్నారు. అదే విధంగా మందడం మెయిన్ సెంటర్ లో ఆందోళన కొనసాగిస్తున్నారు.
నిన్న రాజధానిపై సిఎం వై ఎస్ జగన్కు నివేదికను జీఎన్ రావు కమిటీ అందచేసిన విషయం తెలిసిందే. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీ సీఎం జగన్కు తుది నివేదిక అందజేసింది. ఈ నెల 27వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. క్యాబినెట్ లో చర్చించిన అనంతరం ఈ కమిటీ రిపోర్టుపై నిర్ణయం తీసుకుంటారు.