26.7 C
Hyderabad
May 1, 2025 05: 55 AM
Slider ముఖ్యంశాలు

ఉరకలెత్తుతున్న ఉగ్రగోదావరి

Godavari river

భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం గంట గంటకు పెరుతున్నది. పై నుంచి వస్తున్న వరద నీరు అంతకంతకూ పెరుగుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నది. పశ్చిమగోదావరి జిల్లా కుకునూర్, వేలేరుపాడ్ మండలంలో కూడా గోదావరి ప్రవాహం పెరుగుతున్నది. కుకునూర్, దాచారం మధ్య గల వంతెన పైకి గోదావరి వరద నీరు చేరింది. దాచారం, బెస్తగూడెం, గొమ్ముగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు తమ పొలాల్లోకి వస్తుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలేరుపాడ్ మండలం లోని ఎద్దు వాగు కాజు పైకి వరద నీరు చేరడంతో మండలంలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోయిదా, కాకీస్నూరు, ఎడవల్లి కట్కూరు, చిగురుమామిడి ,తాళ్ళ గొమ్ము, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Related posts

పుకార్లు కొట్టిపారేసిన హేమచంద్ర, శ్రావణ భార్గవి

Satyam NEWS

ఘనంగా తెలుగుదేశం అధ్యక్షుడు రమణ జన్మదిన వేడుక

Satyam NEWS

మూసీలో 13 వేల అక్రమ నిర్మాణాలు?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!