భద్రాచలం పట్టణంలో వరద నీరు పోటెత్తింది. భద్రాచలంలోని రామాలయం మెట్ల వద్ద విస్తా కాంప్లెక్స్ పరిసరాల్లోకి భారీగా వరదనీరు చేరింది. ఆలయంలోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరిగిపోతున్నది. 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చిరికను అధికారులు జారీ చేశారు.
నేటి తెల్లవారు జామున 48.1 అడుగు ఎత్తున గోదావరి ప్రవహిస్తున్నది. దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు అధికారులు లెక్కించారు.
నేటి ఉదయం కల్లా గోదావరి వద్ద 48.70 అడుగులకు ప్రవాహం చేరింది. ఈ విధంగా ప్రమాదకర స్థాయిలో వదర నీటి ప్రవాహం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.