క్రమంగా పెరుగుతున్న వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు పోటెత్తుతున్నదని అధికారులు తెలిపారు.
43 అడుగుల ఎత్తుకు రాగానే గోదావరి లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 45.4 అడుగుల ఎత్తున గోదావరి ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల జల ప్రవాహం ఉంది.
ఇదే రీతిలో వరద నీరు కొనసాగితే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.