గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అటు ఎర్రకాలువ ఉధృతి కి పశ్చిమగోదావరి జిల్లా, నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం లోని శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానానికి ముంపు ప్రమాదం ఏర్పడింది.
ఈనెల 17వ తేదీ నుండి ప్రారంభమయ్యే దేవీ నవరాత్రుల ఉత్సవాలు కు ఆలయం ముస్తాబు అవుతుండగా ఆలయానికి ఈ వర్షపు నీరు తీవ్ర ఆటంకం గా ఏర్పడింది.
ఉత్సవాలు మొదలయ్యే లోపు ఈ వరద నీటిని తోడి వేసి ఆలయాన్ని ముస్తాబు చేస్తామని ఈవో బల్ల నీలకంఠం తెలిపారు.