రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కడప జిల్లా వేంపల్లె పట్టణ సమీపంలోని పాపాగ్నినది పొంగి పరవళ్లు తొక్కుతోంది.
రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా నదీ పరీవాహక ప్రాంతంతో బాటు ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో వేంపల్లె నుండి అలిరెడ్డి పల్లె, తూపల్లె, ఎగువ తూపల్లె గ్రామాలకు పోయేందుకు పాపాగ్ని నదిలో వేసిన తాత్కాలిక మట్టిరోడ్డు కొట్టుకుపోయింది.
ఈ నేపథ్యంలో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో ఏటికి అవతలున్న మూడు గ్రామాల ప్రజలతో పాటు వేంపల్లెకు చెందిన రైతుల భూములు ఏటికి అవతల ఉండటంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.