వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం లో నిర్వహిస్తున్నత్యాగరాజ ఆరాధనోత్సవాలలో రెండో రోజు శుక్రవారం సాయంత్రం వేణువు గాన కచేరి అలరించింది.ఓపెన్ స్లాబ్ పై హైదరాబద్కు చెందిన ప్రసిద్ధ వేణుగాన విధూషీమణి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఏకైక మహిళా వేణువాద్య కళాకారిణి డాక్టర్ జయప్రద రామమూర్తి వేణువుపై సంకీర్తనలు పలికించారు. మోహనరాగ వర్ణం..ఆదితాళం, మంగళకర..వామప్రియ, మిశ్రచాపు, సామజవరగమనా..హిందోళ, రాగం-తానం-పల్లవి..వలజి తదితర కీర్తనలు సంగీత ప్రియుల్ని ఓలలాడించాయి
previous post