ఆకలితో అలమటిస్తూ రోడ్డుపై ఉన్న గోమాత (దూడ) ఆకలిని తీర్చి సహృదయాన్ని చాటుకున్నారు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. నిత్యం సామాజిక సేవలు చేస్తూ తరించే తస్లీమా, శుక్రవారం పూట రోడ్డు పక్కన ఆకలితో ఉన్న గోమాతకు ఆహారం అందించారు.
మనుషులకు ఆకలి వేస్తే అడిగి తీసుకో గలుగుతాం, కాని నోరు లేని మూగ జీవాలు అడుగలేవు, కావున మనమే అర్థం చేసుకొని ఆహారాన్ని అందించాలని తెలిపారు. మూగ జీవాలు అంటే తనకు అమితమైన ప్రేమ అని అన్నారు. అక్కడ ఉన్నవారంతా శుక్రవారం గోమాతకు ఆహారాన్ని అందించడం శుభదాయకం అని అన్నారు.