కరోనా వైరస్ ఉదృతం వలన తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న లాక్ డౌన్ పట్ల ప్రజలందరూ అప్రమత్తతతో మెలగాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటినుండి బయటకు రాకూడదని ఎల్లారెడ్డి డిఎస్పీ శశాంక్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎల్లారెడ్డి సబ్ డివిజన్ లో మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎల్లారెడ్డి లో 5, నాగిరెడ్డిపేట 5, లింగంపేట్, తాడ్వాయి, సదాశివనగర్, గాంధారి పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కటి చొప్పున నమోదు అయ్యాయి.
అంతేకాకుండా ఇప్పటివరకు 1145 వెహికల్స్ ని సీజ్ చేశామని, రూ౹౹ 5,80,535/-అమౌంట్ ఫైన్ వేశామని ఆయన తెలిపారు. ప్రజలు, వ్యాపారులు లాక్ డౌన్ సక్రమంగా అమలు అయ్యేటట్లు సహకరించాలని, ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులను అధిగమిస్తే చట్టపరంగా చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అదేవిధంగా ఎక్కువ రేటుకు నిత్యావసర సరుకులను అమ్మితే చట్టపరంగా చర్య తీసుకుంటామని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో “ఉమ్ము” వేసినచో వారి పైన కూడా కేసు నమోదు చేస్తామని, ఎవరైనా సైకిల్ మోటార్ పైన గానీ, ఫోర్ వీలర్ పైన గాని అనధికారికంగా స్టిక్కర్ అంటించుకుని వెళ్లినా కేసు నమోదు చేస్తామని చెప్పారు. అత్యవసర పని మీద బయటకు రావాల్సి వస్తే ఒక్కరు మాత్రమే వచ్చి తమకు కావలసిన నిత్యావసర సరుకులను గాని, మెడిసిన్స్ కానీ నిర్ణీత సమయంలో తీసుకుని వెళ్ళాలని, అనవసరంగా రోడ్లమీద తిరిగితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.