వలస కూలీల ఆకలి తీర్చడానికి పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్ గార్డెన్ లో వలస కూలీలకు అన్నదానం చేశారు.
పోలీస్ కమిషనర్ సత్యనారాయణ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పనులు లేక ఆర్థికంగా నష్ట పోయి తమ సొంత రాష్ట్రాలకు ట్రైన్ ద్వారా వెళుతున్న జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వలస కూలీలకు భోజనలను అందించారు. వలస కార్మికులను గుర్తించి ఆకలితో సరిహద్దులు దాటకుండా భోజన సదుపాయాలు కల్పించి, వారి వారి రాష్ట్రాల అధికారులతో మాట్లాడి స్వగ్రామాలకు పంస్తామని సిపి సత్యనారాయణ అన్నారు.
అదేవిధంగా పోలీస్ శాఖకు సహకరిస్తూ వలస కార్మికుల కడుపులు నింపడానికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి డి సి పి రవీందర్, గోదావరిఖని ఏసిపి ఉమెందర్, ఏ ఆర్ ఏ సి పి డి సుందర్రావు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు, గోదావరిఖని పట్టణ సిఐ రమేష్, ఆర్ ఐ లు, ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.