హిందూపురం శాసనసభ్యుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ 62 వ జన్మదినం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నానది తీరం నందలి శ్రీ పంచముఖ ఆంజనేయస్వామిగుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్థానిక గాంధీ రోడ్ నందు ప్రముఖ వైద్యుడు డా. ఎన్. వీరాంజనేయులు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు.
అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా వ్యాధిగ్రస్తులకు పట్టణ నందమూరి యువసేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తాటిపాటి రామ్ గోపాలశర్మ, గుర్రప్ప యాదవ్(అడ్వకేట్), లెజెండ్ ఓబుళరెడ్డి, సి.సిద్ధయ్య, సింహా శేఖర్, గోమేధికమ్ సుదర్శన్, సిజె.వెంకటసుబ్బయ్య, టి.సుధాకర్ యాదవ్,
ఎస్.సురేష్ కుమార్, డి.బాలకుళాయప్ప, జి.యస్.చాంద్ బాష, యమ్.మల్లికార్జున, జి.విమల్, కె. సురేష్, యమ్మనూరు ఆంజనేయులు, యమ్మనూరు నాగరాజు, యమ్మనూరు రాజశేఖర్,
పూజల రమణ, పూజల వాసు, గుర్రం అంజి, బాలు, కేతినేని మురళి, ఉదయ్ కుమార్ రెడ్డి, చంద్ర రెడ్డి, జి.ప్రసాద్, జిలాన్ బాష, కుళాయప్ప తదితరులు పాల్గొన్నారు.