వలస కూలీలను ఆదుకోవడానికి పలువురు వ్యక్తిగతంగానూ, సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ శివారు లోని గోకుల్ ప్లాట్స్ లో సుమారు 600 మంది వలస కూలిలకు ఆహార పదార్ధాలు అందచేసి కాలనీవాసులు తమ పెద్ద మనసు చాటుకున్నారు.
మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ వార్డు మెంబర్ పితాని లక్ష్మి శ్రీనివాస్, నిమ్మకాయ సుబ్బారావు, పెద్ద సైదులు అండ్ బ్రదర్స్, సెవెంత్ క్లాస్ వార్డు మెంబర్ వెంకటరమణ యాదవ్, తెల్లబోయిన కొండలరావు, కలి పురుషోత్తం, శ్రీనివాస్, చెన్నారావు రాజు, కుక్కల రమణ ఈ సహాయంలో పాలుపంచుకున్నారు. గోకుల్ ప్లాట్స్ కాలనీవాసులు అందరూ కలిసి ఈ కార్యక్రమమును జయప్రదం చేశారు.