హైదరాబాద్ శివారులోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 వ డివిజన్ కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి నేడు 300 వందల మంది పేదల ఆకలి తీర్చారు. వారికి ఉచితంగా భోజన పాకెట్స్, బట్టర్ మిల్క్ , వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం డివిజన్ కార్పొరేటర్ మాధవి రఘుపతి రెడ్డి అహర్నిశలు పాటు పడుతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు లేత ఆకుల రఘుపతి రెడ్డి, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.