ఏలూరు జిల్లా పెదవేగి మండలం కుచింపూడి ప్రభుత్వ పాఠశాలలో 15మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని పెదవేగి ప్రభుత్వ హాస్పిటల్ కి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు ఆర్ డి ఓ విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై పాఠశాల ఉపాధ్యాయులను, వైద్యాధికారుల ను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆరాతీస్తున్నారు. కలెక్టర్ వెంట పెదవేగి తహసీల్దార్ ఎన్. నాగరాజు.ఎం పి డి ఓ రాజ్ మనోజ్ తదితరులున్నారు.