కరోనా లాక్ డౌన్ సమయంలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సహాయకులు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యం ఆహారం అందచేయాలని శ్రీ మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటేబుల్ ట్రస్ట్ నిర్ణయించింది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో గత 25 సంవత్సరాలు గా యోగ తరగతులు నిర్వహిస్తున్న శ్రీ జగన్ గురూజీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి ఆహారం అందచేస్తున్నారు. ఈ విధంగా లాక్ డౌన్ విరమించే వరకు శ్రీ మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి రోజు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
కరోనా మహమ్మరితో పోరాడుతున్న బల్దియా సోదరులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వైద్యులకు పాత్రికేయ మిత్రులకు ఈ విపత్తులో ప్రజలకు సేవ చేసే అందరికి ఆహారం అందిస్తామని శ్రీ జగన్ గురూజీ శిష్య బృందం తెలిపింది. కూకట్ పల్లి, మియాపూర్ పరిసరాల్లో తమ సేవలు అందచేస్తామని నిర్వాహకులు తెలిపారు.